వర్మకి బిగ్ షాక్.. 'లక్ష్మీస్ ఎన్టీఆర్' విడుదలకు హైకోర్టు బ్రేక్

 

దర్శకుడు రాంగోపాల్ వర్మకి ఏపీ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. రాంగోపాల్ వర్మ తెరక్కించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా విడుదలకు హైకోర్టు బ్రేక్ వేసింది. ఈ సినిమా విడుదలపై హైకోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది. ఏప్రిల్ 15వ తేదీ వరకు సినిమా విడుదలను ఆపాలని ఆదేశించింది. అప్పటివరకు వరకు సినిమా హాళ్లలో కానీ, సోషల్ మీడియాలో గానీ ప్రదర్శించొద్దని స్పష్టం చేసింది. షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా ఈ నెల 29వ తేదీన రిలీజ్ కావాలి. కానీ అనూహ్యంగా సినిమా విడుదలకు ఒకరోజు ముందు హైకోర్టు చిత్ర యూనిట్ కి బిగ్ షాకిచ్చింది.