అక్టోబర్ 2 నుంచి కొత్త పేరుతో 'అన్నక్యాంటీన్లు'!!

 

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన అన్నక్యాంటీన్లను వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మూసివేసిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ శ్రేణులు నిరసనలు వ్యక్తం చేసాయి. రూ.5 కే పేదవాడి కడుపు నింపుతున్న క్యాంటీన్లను మూసివేయడం ఏంటని, అవసరమైతే పేరు మార్చి కొనసాగించాలని టీడీపీ నేతలు సూచించారు. అయితే వైసీపీ మాత్రం..  అన్నక్యాంటీన్ల ఏర్పాటులో అవినీతి జరిగిందని, అందుకే తాత్కాలికంగా మూసివేశామని, మళ్ళీ త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పుకొచ్చింది. చెప్పినట్లుగానే వైసీపీ సర్కార్ మళ్ళీ క్యాంటీన్లను ప్రారంభించబోతుందని తెలుస్తోంది. 'అన్నక్యాంటీన్లు' 'వైఎస్సార్ క్యాంటీన్లు' పేరుతో అక్టోబరు 2వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయని సమాచారం. ఈ క్యాంటీన్లకు భోజనం సరఫరా చేసే అక్షయపాత్ర ప్రతినిధులకు ఈ మేరకు ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం అందినట్లు తెలుస్తోంది.