ఏపీ ఆలయాల్లో అర్చకులకు ఫ్రీ హ్యాండ్!
Published on: Thu Oct 10, 2024 10:37AM

ఆంధ్రప్రదేశ్లోని దేవాలయాల్లో అర్చకులకు ఫ్రీహ్యాండ్ ఇస్తూ చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆలయాల్లో వైదిక విధుల్లో ఈవో నుంచి దేవాదాయ కమిషనర్ వరకూ ఎవరూ జోక్యం చేసుకోకుండా ఉత్తర్వులు జారీ చేసింది. ఆధ్యాత్మిక విషయాల్లో ఏకాభిప్రాయం కుదరకపోతే పీఠాధిపతుల సూచనలు తీసుకోవాలని ఆ ఉత్తర్వులలో పేర్కొంది. ఆలయ వైదిక విధులలో అధికారుల జోక్యం కారణంగా సంస్కృతి, సంప్రదాయాలు దెబ్బతినే అవకాశముందని అలా దెబ్బతినకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఆలయ అభివృద్ధి విషయంలో తప్ప వైదిక విధుల్లో అధికారులు సహా ఇతరుల జోక్యం కూడదని స్పష్టం చేసింది.


