కోడెల మృతి పై ఎపి డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు

 

ఎపి మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతిపై ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. కోడెల మృతి పై స్పందిస్తూ ఆయనది ఆత్మహత్య కాదని.. ప్రభుత్వమే హత్య చేసిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కోడెలను కేసులతో వేధించడం వల్లే చనిపోయారని చంద్రబాబు సైతం విమర్శించారు. ప్రభుత్వం పై టీడీపీ తీవ్ర ఆరోపణలు చేయడంతో వైసీపీ నేతలు కూడా ఎదురుదాడికి దిగుతున్నారు. ఇదే సందర్భంలో  ఏపీ డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ కోడెల మృతి పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. "ఎవరు దొంగతనం చేయమన్నారు? ఎవరు చనిపోమన్నారు? " అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేసారు. కోడెల కోడలు కూడా ఆయన పై కేసు పెట్టిందన, కేసులు నమోదైనప్పుడు ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు కదా. అసెంబ్లీ ఫర్నిచర్ దొంగతనం చేసినట్లు ఆయనే అంగీకరించారు. ప్రభుత్వ ఆస్తి మా దగ్గర ఉంది..డబ్బులు కడతానని ఆయనే అన్నారు. దానితో ప్రజలకు ముఖం చూపించలేకే కోడెల చనిపోయి ఉంటారు అని ఎపి డిప్యూటీ సీఎం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఐతే మరణించిన వ్యక్తిపై ఇలాగేనా మాట్లాడేదని  పిల్లి సుభాష్  చంద్రబోస్ పై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి.