ఏపీ డిప్యూటీ సీఎంకు కరోనా పాజిటివ్ 

ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉంది. దీంతో పాటు ఇప్పటికే ఏపీలోని అనేకమంది ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడ్డారు. కొద్ది రోజుల క్రితం సీఎం జగన్ కడప పర్యటనలో డిప్యూటీ సీఎం అంజాద్ భాషా ఎక్కడా కనిపించకపోవడం తో ఆయనకు కరోనా సోకిందని వార్తలు వచ్చాయి. ఐతే ఆయన గన్మెన్ కు కరోనా సోకిందని అందుకే అయన సీఎం పర్యటనకు దూరంగా ఉన్నారని తెలుస్తోంది. ఐతే తాజాగా డిప్యూటీ సీఎం కుటుంబానికి కరోనా టెస్ట్ లు చేయగా అంజాద్ బాషా తో పాటు అయన భార్య, కుమార్తెకు కూడా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో వారిని తిరుపతిలోని స్విమ్స్ కోవిడ్ ఆస్పత్రిలోని ప్రత్యేక గదిలో ఉంచి చికిత్స అందించారు. ఆ తరువాత చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. తాజాగా అంజాద్ బాషా కు కరోనా నిర్ధారణ కావడంతో కొద్ది రోజులుగా ఆయనతో సన్నిహితంగా మెలిగిన నేతలు కూడా కరోనా పరీక్షలు చేయించుకుంటున్నారు.