తిరుమల నుండి హుటాహుటిన హైదరాబాద్ కు బయలుదేరిన సీఎం జగన్.. ఎందుకంటే..
posted on Sep 24, 2020 11:45AM
ఏపీ సీఎం జగన్ తిరుమల పర్యటన ఈ రోజు ఉదయంతో ముగిసింది. ఐతే తిరుమల నుండి అమరావతికి చేరుకోవాల్సిన సీఎం జగన్ పర్యటనలో చివరి నిమిషంలో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. సీఎం సతీమణి వైఎస్ భారతి తండ్రి అనారోగ్యం కారణంగా చివరి నిమిషంలో అయన హైదరాబాద్ కు బయలుదేరారు. కొద్దీ సేపటి క్రితం రేణిగుంట ఎయిర్ పోర్టు నుండి బయలుదేరిన అయన నేరుగా బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకోన్నారు. తీవ్ర అనారోగ్యం కారణంగా సీఎం భార్య వైఎస్ భారతి తండ్రి గంగిరెడ్డి హైదరాబాద్ లోని కాంటినెంటల్ హాస్పిటల్ లో చేరారు. దీంతో ఈరోజు ఉదయం 11:30 గంటలకు నగరంలోని కాంటినెంటల్ ఆసుపత్రికి వెళ్లి తన మామగారైన గంగిరెడ్డిని పరామర్శించనున్నారు. తరువాత మళ్ళీ తిరిగి బేగంపేట ఎయిర్ పోర్ట్ నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకుంటారు.