సీఎం జగన్ సడెన్ ఢిల్లీ టూర్!!

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి‌ మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాతో జగన్‌ భేటీ కానున్నారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశముంది. అలాగే ఇతర కేంద్ర మంత్రులతో కూడా సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఏపీలో తాజాగా నెలకొన్న పరిణామాలపై జగన్‌ అమిత్ షాతో చర్చించే అవకాశం ఉంది. ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసంపై రాజకీయ దుమారం రేగుతోంది. దీనిపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై అమిత్‌షాతో జగన్‌ చర్చించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. విగ్రహాల ధ్వంసం వెనుక రాజకీయ కుట్ర ఉందని నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం. అయితే విగ్రహాల ధ్వంసం వెనుక కొందరు బీజేపీ నేతల హస్తం కూడా ఉందని ఏపీ డీజీపీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీంతో, ఏపీ బీజేపీ నేతలు డీజీపీ వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఆయనను తప్పించాలని డిమాండ్ చేశారు. మరోవైపు, బీజేపీ నేతలు ఆలయాల రక్షణ కోసం పాదయాత్ర చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ సడెన్ ఢిల్లీ పర్యటన రాజకీయవర్గాల్లో ఆసక్తి రేకిత్తిస్తోంది.