మోడీకి చంద్రబాబు లేఖ..

 

ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో జరిగిన దాడి కేసులో ఎన్‌ఐఏ దర్యాప్తుపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై మండిపడుతూ..ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 5 పేజీల లేఖ రాశారు. కోడి కత్తి కేసు ఎన్‌ఐఏ పరిధిలోకి ఎలా వస్తుందని నిలదీశారు. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించారని చంద్రబాబు లేఖలో మండిపడ్డారు. జగన్‌పై దాడి కేసులో ఎన్‌ఐఏ దర్యాప్తు సరికాదని పేర్కొన్నారు. 2008లో ఎన్‌ఐఏ చట్టాన్ని మోదీ వ్యతిరేకించారని లేఖలో చంద్రబాబు గుర్తుచేశారు. ఇప్పుడదే చట్టాన్ని అనుసరిస్తూ జగన్‌పై దాడి కేసును ఆ సంస్థకు అప్పగించారన్నారు. ఎన్‌ఐఏ చట్టంపై మోదీ ద్వంద్వ విధానం అవలంభిస్తున్నారని విమర్శించారు. విదేశీ శక్తుల ప్రమేయం ఉండే కేసులను మాత్రమే జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించాలని పేర్కొన్నారు. వ్యక్తిగత దాడి కేసును కూడా ఎన్‌ఐఏకు అప్పగించడం దారుణమని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.