దేశానికి తీరని లోటు- చంద్రబాబు

 

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి పార్థివదేహానికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళులర్పించారు.. అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు, వాజ్‌పేయి మృతి దేశానికి తీరనిలోటన్నారు.. ఉన్నత విలువలు కలిగిన వ్యక్తి వాజ్‌పేయి అని, వాజ్‌పేయి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానని అన్నారు.. అలాగే ఏపీ అభివృద్ధికి వాజ్‌పేయి సహకరించారని, అన్ని సంస్కరణలకు వాజ్‌పేయి ఆద్యుడు అని చంద్రబాబు అన్నారు.