అసెంబ్లీలో జగన్‌కి బాబు చురకలు

 

ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా విజయవాడను ప్రకటించిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో సుదీర్ఘమైన ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రతిపక్ష నాయకుడు జగన్ మీద చురకలు వేశారు. జగన్ ప్రతిదానికీ చేతులెత్తి మాట్లాడ్డం కాదు.. విషయ పరిజ్ఞానం పెంచుకోవడానికి ప్రయత్నించాలని అన్నారు. జగన్ ఇప్పుడు కొత్తగా అసెంబ్లీకి వచ్చారని, తాను ఇదే అసెంబ్లీలో చాలామంది పెద్దలను ఢీకొన్నానని జగన్ తెలుసుకోవాలని అన్నారు. ప్రభుత్వం చేస్తున్న ప్రతి పనినీ విమర్శించడమే పనిగా పెట్టుకోవడం కంటే ఈ సంక్షోభ సమయంలో ప్రభుత్వానికి ప్రతిపక్షం అండగా నిలవాలని చెప్పారు. జగన్‌కి అవకాశం వుంటే ఆంధ్రప్రదేశ్ రాజధానిని ఇడుపులపాయలో పెట్టుకునేవారని వ్యంగ్యంగా అన్నారు.