TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఏపీ రైతులు హ్యాపీ

Published on: Fri May 1, 2015 4:44PM

 

ఆంధ్రప్రదేశ్ రైతులకు హైకోర్టు ఊరట కలిగించింది. ఆంధ్రరాష్ట్ర నూతన రాజధాని కోసం తీసుకుంటున్న భూముల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై హైకోర్టు మండిపడింది. రైతులు వ్యవసాయం చేసుకొనే భూముల జోలికి ప్రభుత్వం వెళ్ళొద్దంటూ, రైతులు వారి పొలాలలో వ్యవసాయం చేసుకోవచ్చని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రైతులకు కొంత ఊరట లభించింది. తమ భూములను నూతన రాజధాని కట్టడానికి ఇవ్వడం ఇష్టం లేదని సుమారు 300 మంది రైతులను హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కొంతమంది రైతులు తమ వద్ద బలవంతంగా అంగీకార పత్రాలు తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే అంగీకార పత్రాలు ఇచ్చినవారు కూడా తమ భూములలో వ్యవసాయం చేసుకోవచ్చని హైకోర్టు తేల్చి చెప్పేసింది.