ప్రభుత్వ పరిపాలన భవనాల సముదాయానికి శంకుస్థాపన...

 

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ విజయవాడలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా... అరుణ్‌ జైట్లీ, కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం లింగాయపాలెంలో ప్రభుత్వ పరిపాలన భవనాల సముదాయానికి శంకుస్థాపన చేశారు. రాష్ట్ర సచివాలయం, శాసనసభ, మండలి భవనాలు, రాజ్‌భవన్‌, ముఖ్యమంత్రి నివాస భవనం, ప్రభుత్వ విభాగాధిపతుల కార్యాలయాలు, మంత్రులు, అధికారులు, ఉద్యోగుల నివాస గృహాలు వంటివన్నీ ప్రభుత్వ భవనాల సముదాయంలో భాగంగానే నిర్మిస్తారు. ఈ నిర్మాణాలను 2018 డిసెంబర్‌ నాటికి కొలిక్కి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. 950 ఎకరాల్లో నిర్మించే ప్రభుత్వ భవనాల సముదాయానికి రూ.5,600కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. ఇంకా ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.