రేపు ఏ పీ క్యాబినెట్: మూడు నెలల బడ్జెట్ కోసం ఆర్డినెన్స్ తెచ్చే యోచన 

రేపు ఉదయం 11 గంటలకు ఆంధ్ర ప్రదేశ్ క్యాబినెట్ భేటీ కానున్నది. సచివాలయంలో భేటీ కానున్న మంత్రివర్గం కీలక అంశాల పైన చర్చించనుంది. సామాజిక దూరం పాటించేలా ఐదో బ్లాక్ కాన్ఫరెన్స్ హాల్లో క్యాబినెట్ సమావేశం నిర్వహించే యోచనలో అధికారులు. మూడు నెలల బడ్జెట్ కు ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావటానికి వెసులుబాటు ఉన్న అంశాలమీద కూలంకుషంగా చర్చించ వచ్చునని తెలుస్తోంది. జూన్ 30 వరకూ అవసరమైన  నిధులకు ఆర్డినెన్స్ పెట్టనున్నారనీ, క్యాబినెట్ ఆమోదం తర్వాత గవర్నర్ కు ఆర్డినెన్స్ ను పంపనున్నారనీ సమాచారం.