పయ్యావుల పద్దుకు కేబినెట్ ఆమోదం
Published on: Fri Feb 28, 2025 9:03AM
.webp)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ అయ్యింది. శుక్రవారం (ఫిబ్రవరి 28) ఉదయం జరిగిన ఈ భేటీలో కేబినెట్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశ పెట్టనున్న బడ్జెట్ కు ఆమోదం తెలిపింది.
2025-26 ఆర్థిక సంవత్సరానికి కు రూ. 3.24 లక్షల కోట్ల అంచనాలతో బడ్జెట్ రూపొందింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడమే లక్ష్యంగా బడ్జెట్ రూపకల్పన చేసినట్లు పయ్యావుల కేశవ్ తెలిపారు.
అంతకు ముందు పయ్యావుల కేశవ్ అమరావతిలో ని టిటిడి ఆలయానికి వెళ్లి వెంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. 2025-26 బడ్జెట్ ప్రతులను శ్రీవారి పాదాల వద్ద ఉంచి ఆర్థిక ఇబ్బంది లేకుండా రాష్ట్రాన్ని , ప్రజలను కాపాడాలని వేడుకున్నారు.


