లోకేశ్, చంద్రబాబులను వదిలేది లేదు-మావోయిస్టులు

ఆంధ్రా-ఒరిస్సా సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో చావు దెబ్బతిన్న మావోయిస్టులు ప్రతీకారంతో రగిలిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేశ్‌లను వదిలేది లేదని మావోయిస్టు ఏపీ అధికార ప్రతినిధి శ్యామ్ ప్రకటన విడుదల చేశారు. అవసరమైతే చంద్రబాబు కుటుంబంపై ఆత్మహుతి దాడులు జరుపుతామని..ఎల్లకాలం పోలీసులు, మిలటరీ ఆయనను కాపాడలేవని స్పష్టం చేశారు. కోవర్టు ఆపరేషన్ ద్వారా ఆహారంలో విషం కలిపి, మావోయిస్టులు అపస్మారక స్థితిలో ఉన్నపుడు పోలీసులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారని ఆరోపించారు. తమకు సంబంధించిన తుపానుల్లో ఇది అతిపెద్ద తుపాను అని..దీనిని తట్టుకుని నాలుగు రోజుల్లో నిలబడతామని శ్యామ్ ప్రకటించారు.