ఏవోబీ ఎన్‌కౌంటర్‌.. మావోల బంద్ పిలుపు

 


ఆంధ్ర, ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో వారం రోజుల క్రిందట భారీ ఎన్ కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్‌కౌంటర్లో చాలా మంది మావోయిస్ట్ లు చనిపోయారు. అయితే ఎన్‌కౌంటర్‌కు నిరసనగా మావోలు బంద్ కు పిలుపు ఇచ్చినట్టు తెలుస్తోంది. రేపు ఐదు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, చత్తీస్‌గఢ్, మహారాష్ట్రల్లో  బంద్‌కు మావోలు పిలుపునిచ్చారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా ఏపీలో ఉత్తరాంధ్ర ఏజెన్సీ, ఉభయ గోదావరి జిల్లాలు, గుంటూరుతోపాటు తెలంగాణలోని కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, భద్రాచలం ఏజెన్సీలలో పోలీసులు అప్రమత్తమయ్యారు. బంద్ సందర్భంగా మావోయిస్టులు విధ్వంసానికి పాల్పడే అవకాశం ఉండడం సరిహద్దుల్లో పోలీసులు భారీగా మోహరించారు. హై అలెర్ట్ ప్రకటించారు.