ఎస్ఎల్ బిసి టన్నెల్ లోకి వెళ్లిన అన్విరోబో
Published on: Tue Mar 11, 2025 2:33PM
ఎస్ ఎల్ బిసి టన్నెల్ లోకి రెస్క్యూ టీం సహాయక చర్యలు చేపట్టింది. గత నెలలో ఘటన జరిగినప్పటికీ కనిపించకుండాపోయిన 8 మంది సిబ్బంది కోసం 17 రోజుల నుంచి వెతుకుతున్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. కేరళ నుంచి జాగిలాలను రప్పించి డీ కంపోజ్ అయిన మృతదేహాలను వెతుకుతున్నారు. పంజాబ్ కు చెందిన గురు ప్రీత్ సింగ్ డెడ్ బాడీని గుర్తించిన డాగ్ స్క్వాడ్ మరో రెండు మృత దేహాలను గుర్తించింది. కేరళ నుంచి వచ్చిన డాగ్ స్వాడ్ జిపిఏ ద్వారా స్కాన్ చేసిన ప్రాంతంలోనే డెడ్ బాడీ ఉన్నట్టు గుర్తించింది. మద్రాస్ ఐఐటి విద్యార్థులు తయారు చేసిన అన్వి రోబో టన్నెల్ లోకి వెళ్లింది. టిబిఎం మెషీన్ నుంచి 20 మీటర్ల దూరంలో సహాయక చర్యలు చేపట్టారు. మనిషి ఆకారంలో ఉండే రోబో కాకుండా ప్రత్యేకంగా అన్వి రోబో తయారు చేశారు. అందరి అంచనాలకు అందకుండా రోబో ఉంది. ఎస్ ఎల్ బిసి టన్నెల్ లో ఆదునాత సాంకేతికతో మృత దేహాలను వెలికి తీసే పనిలో ఉన్నారు.


