ఆ వార్తలు పచ్చి అబద్ధాలు.. అనుష్క...

 

బాలీవుడ్ నటి అనుష్క శర్మ - క్రికెటర్ విరాట్ కోహ్లీ మధ్య వున్న సంబంధం గురించి రకరకాల వార్తలు ప్రచారంలో వున్నాయి. అయితే వాటి మీద ఇప్పటి వరకు అనుష్క శర్మ స్పందించలేదు. అయితే తాజాగా ఆమె స్పందించారు. విరాట్ కోహ్లితో త్వరలో తన వివాహం జరగనుందన్న వార్తల్ని అనుష్క శర్మ ఖండించారు. ఆ వార్తలు వాస్తవం కాదని, పచ్చి అబద్ధాలని పేర్కొంటూ అనుష్క తరపు ఒక ప్రకటన విడుదల చేశారు. ‘అనుష్క శర్మ పెళ్లి చేసుకోబోతోందంటూ పలు పుకార్లు వినిపిస్తున్నాయి. కానీ, అందులో ఏమాత్రం నిజంలేదు. అవి పూర్తిగా నిరాధారమైన వార్తలు... పచ్చి అబద్ధాలు’ అని ప్రకటనలో పేర్కొన్నారు.