అందరి అంగీకారంతోనే విభజన



తెలంగాణ అంశంపై కేంద్రం నిర్ణయానికి కాంగ్రెస్‌ నాయకులు అంతా కట్టుబడి ఉంటామని మాట ఇచ్చారని దిగ్విజయ్‌ సింగ్‌ అన్నారు. అన్ని పార్టీలతో విస్తృత స్థాయి సమావేశాల తరువాతనే నిర్ణయం ప్రకటించామన్న ఆయన ఇప్పుడు పొలిటికల్‌ పార్టీలన్ని ఇలా యు టర్న్‌ తీసుకోవడం కరెక్ట్ కాదన్నారు.

మంగళ వారం ఆంటోని కమిటీతో సమావేశం అయిన కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్‌ తరువాత మీడియాతో మాట్లాడారు. సీమాంద్ర ప్రజలకు కూడా సరైన న్యాయం చేస్తామన్నారు. తెలంగాణ ప్రక్రియ కొనసాగుతుందని మరోసారి పునరుద్ఘాటించారు.