TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పోసానికి  మరో షాక్... గుంటూరు జైలుకు 14 రోజుల రిమాండ్ 

Published on: Thu Mar 13, 2025 10:38AM

సినీ నటుడు , వైకాపా నేత పోసాని కృష్ణ మురళికి గుంటూరు కోర్టు 14  రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. గుంటూరు సిఐడి పోలీసులు పిటి వారెంట్ మీద కర్నూలు జైలు నుంచి అదుపులోకి  తీసుకున్నారు. చంద్రబాబు , పవన్ కళ్యాన్ లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోసానిపై ఎపిలో 17 పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.  ఓబులాపురం పోలీసులు హైద్రాబాద్ లోని పోసాని నివాసంలో  అరెస్ట్ చేసి రాజంపేట జైలుకు తరలించారు. అక్కడ నుంచి పోసాని ని నరసారావ్ పేట పోలీసులు  పిటి వారెంట్ పై అరెస్ట్ చేసి గుంటూరు జైలుకు తరలించారు.  పిటి వారెంట్ పై అదోని పోలీసులు  గుంటూరు జైలు  నుంచి అదుపులో తీసుకుని కర్నూలు జైలుకు తరలించారు.  గుంటూరు సిఐడి పోలీసులు పిటి వారెంట్ పై  కర్నూలు జైలు నుంచి  గుంటూరు జైలుకు తరలించారు. పిటి వారెంట్లను సవాల్ చేస్తూ  పోసాని హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. కర్నూలు జైలు నుంచి బెయిల్ పై పోసాని విడుదల అవుతారని అందరూ ఊహించారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఆయనపై వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు కావడంతో అరెస్ట్ లు అనివార్యమయ్యాయి.  సిఐడి కోర్టులో ప్రవేశ పెట్టినప్పుడు  వాదనలు సమయంలో పోసాని బోరున విలపించారు.