శ్రీలంకలో మరో బాంబు పేలుడు

 

శ్రీలంకలో వరుస బాంబు దాడుల కలకలాన్ని మర్చిపోక ముందే కొలంబోలోని మరో చర్చి వద్ద పేలుడు సంభవించింది. ఆంథోనిస్ చర్చి వద్ద ఆగి ఉన్న వ్యానులో బాంబు ఉందని తెలిసి దాన్ని ప్రత్యేక టాస్క్‌ ఫోర్స్‌ దళాలు నిర్వీర్యం చేసేలోపు అది ఒక్కసారిగా పేలింది. ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు తెలుస్తోంది.

కొలంబో వ్యాప్తంగా పోలీసులు, ఆర్మీ విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటికే విమానాశ్రయం వద్ద ముష్కరులు అమర్చిన బాంబులను  గుర్తించి పోలీసులు నిర్వీర్యం చేశారు. ఇప్పుడు కొలంబోలోని ప్రధాన బస్టాండ్‌లో 87 డిటోనేటర్లను గుర్తించారు. తనిఖీల్లో భాగంగా వీటిని గుర్తించామని, సమయానికి గుర్తించకపోయి ఉంటే మరో దారుణం జరిగి ఉండేదని పోలీసులు తెలిపారు. దీంతో పోలీసు శాఖ మరింత అప్రమత్తమైంది. రద్దీ ప్రాంతాల్లో భద్రతను మరింత పెంచారు.