TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కోటికి పైగా విలువ చేసే అక్రమ మద్యం డంప్ సీజ్

Published on: Fri Oct 3, 2025 9:12PM

 

అన్నమయ్య జిల్లాలో కల్తీ మద్యం తయారు చేస్తున్న డంపును ఎక్సైజ్, స్థానిక పోలీసులు సీజ్ చేశారు. ఇందుకు సంబంధించి ఎక్సైజ్ అధికారులు తెలిపిన వివరాలు మేరకు తంబళ్లపల్లె నియోజకవర్గం, మొలకలచెరువులో రూ. కోటికి పైగా విలువ చేసే అక్రమ మద్యం తయారీ డంప్ ను ఎక్సైజ్ అధికారులు శుక్రవారం కనుగొన్నారు. స్థానికంగానే పెద్ద ఎత్తున నకిలీ మధ్యాన్ని తయారు చేస్తున్న 9 మందిని పట్టుకుని ఎక్సైజ్, స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన అక్రమ మద్యం, తయారీకి వినియోగించే యంత్రాలు, ముడిసరుకు సీజ్ చేశారని పోలీసులు తెలిపారు. గత కొంతకాలంగా అక్రమ మద్యం  తయారీ రాజకీయ నాయకుల కనుసన్నల్లో జరుగుతుంది