రెడ్డీస్ ల్యాబ్స్ అధినేత అంజిరెడ్డి కన్నుమూత
posted on Mar 15, 2013 7:15PM
భారతీయ ఔషద పరిశ్రమలో ప్రఖ్యాత ఖ్యాతిపొందిన ప్రముఖ వ్యాపారవేత్త రెడ్డీ ల్యాబ్స్ అధినేత డాక్టర్ అంజిరెడ్డి శుక్రవారం కన్నుమూశారు. ఆయన వయస్సు 73 ఏళ్లు. అనారోగ్యంతో బాధపడుతున్న అంజిరెడ్డి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయనకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.
1943లో గుంటూరు జిల్లా, తాడేపల్లిలో జన్మించిన అంజిరెడ్డి 1984లో రెడ్డీ ట్యాబ్ను ప్రారంభించారు. దేశంలో రెండవ అతిపెద్ద ఫార్మా కంపెనీగా ఎదిగింది. ఆయన ఎంతో శ్రమించి రెడ్డి ల్యాబ్స్ను ఈ స్థాయికి తీసుకువచ్చారు. భారతీయ ఔషద పరిశ్రమపై చెరగని ముద్ర వేసుకున్నారు. ఔషాధాల తయారీలో ప్రపంచానికే గుర్తింపు తీసుకు వచ్చారు. ఫార్మా రంగంలో ఆయన సేవలను గుర్తించిన ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది.