మోడీపై అవిశ్వాసం పెడతాం.. బాబు మద్దతిస్తారా..?

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా సాధించి తీరుతామని.. అందుకోసం తన పార్టీ ఎంపీలతో ఏప్రిల్ 6న రాజీనామా చేయిస్తున్నట్లు తెలిపి ఒక్కసారిగా రాజకీయాలను వేడెక్కించారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. అయితే జగన్‌వి డ్రామాలేనని.. కేసుల మాఫీ కోసమే ఆయన రాజీనామా డ్రామాలు ఆడుతున్నారంటూ విమర్శలు వస్తుండటంతో.. జగన్ గేర్ మార్చారు. ఏపీకి ప్రత్యేకహోదా కోసం కేంద్రప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకైనా సిద్దంగా ఉన్నామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా ఇవాళ ప్రకాశం జిల్లా కందుకూరులో జగన్ మాట్లాడుతూ.. మార్చి చివరి వారంలో కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెడతామని.. తెలుగుదేశం తమకు మద్దతు ఇస్తుందా..? అని ఈ సందర్భంగా జగన్ ప్రశ్నించారు. లేదంటే ఒకవేళ టీడీపీయే కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెడితే మద్దతు ఇచ్చేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. ప్రత్యేకహోదా వస్తేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు.