రాయలసీమలో ఏపీ రెండో రాజధాని: సునీత

 

ఆంధ్రప్రదేశ్‌కి చెందిన పలువురు నాయకులు ఎవరికి వారు తమ ప్రాంతంలోనే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పడాలన్న ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నారు. ఎవరు ఎన్ని ఆకాంక్షలు వ్యక్తం చేసినా విజయవాడ, గుంటూరు నగరాల మధ్యలోనే రాజధాని నగరం ఏర్పడే అవకాశాలు వున్నాయని స్పష్టంగా తెలుస్తోంది. ఈ విషయం తెలిసి కూడా కొంతమంది రీసెంట్‌గా రాయలసీమలో రాజధాని వుండాలని ఒకరంటే, రాజధాని ఒంగోలులోనే వుండాలని మరికొందరూ అంటూ వచ్చారు. తాజాగా పరిటాల రవి సతీమణి, రాష్ట్ర మంత్రి పరిటాల సునీత ఒక కొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. రాజధాని అనేది రాష్ట్రం నడిబొడ్డునే వుండాలని ఆమె చెప్పారు. అంటే పరోక్షంగా విజయవాడ - గుంటూరు ప్రాంతమే రాజధానిగా వుండాలన్నది ఆమె అభిమతం. అయితే ఆమె మరో ఆసక్తికరమైన మాట అన్నారు. రాయలసీమలో రెండో రాజధానిని ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పారు. ఏదో బాగానే వున్నట్టుందే అనిపించిన ఈ ప్రతిపాదన కార్యరూపంలోకి వస్తుందో లేదో చూడాలి.