ఏపీ కొత్త రాజధానికి ఎన్టీఆర్ పేరు....

 

ఆంధ్రప్రదేశ్ రాజధానికి దివంగత మహా నటుడు, మహా నాయకుడు, తెలుగువారి కీర్తిని అంతర్జాతీయ స్థాయికి చాటిన ఎన్టీఆర్ పేరు పెట్టాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర కొత్త రాజధానికి ఎన్టీఆర్ పేరు కలసి వచ్చేలా పెడితే ఎనిమిది వేల ఎకరాల భూమిని ఇవ్వడానికి గుంటూరు జిల్లా రైతులు సిద్ధంగా వున్నారని మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. అలాగే మంగళవారం నాడే ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి ప్రకటన చేయాలని భావించినప్పటికీ, మంచి ముహూర్తం కోసమే ప్రకటనను ఎల్లుండికి ముఖ్యమంత్రి చంద్రబాబు వాయిదా వేశారని మంత్రి చెప్పారు. ఏదైనా మంచి పని చేపట్టే ముందు ముహూర్తబలం కూడా బాగుండాలన్నదే తమ ఉద్దేశమని ఆయన వివరించారు.