స్థానికతని నిర్ణయించడానికి కేసీఆర్ ఎవరు?: ఏపీ మంత్రులు

 

విద్యార్థుల స్థానికతను నిర్ణయించడానికి కేసీఆర్ ఎవరని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, రావెల కిషోర్ బాబు అన్నారు. విద్యార్థుల స్థానికతపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని వారు చెప్పారు. ఆర్టికల్‌-371(డీ) ఉండగా కొత్త నిబంధనలు ఎలా తీసుకువస్తారని వారు ప్రశ్నించారు. ఈ అంశంపై న్యాయ పోరాటం చేస్తామని, గవర్నర్‌, కేంద్రం తక్షణమే ఈ విషయంలో జోక్యం చేసకోవాలని విజ్క్షప్తి చేశారు. రాష్ట్రాలు ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తే కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని అన్నారు.