రాజధాని కృష్ణ - గుంటూరు మధ్య బెస్ట్.. ఎందుకంటే..!

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త రాజధానికి కృష్ణా- గుంటూరు జిల్లాల మధ్య ప్రాంతం అన్నివిధాలా అనుకూలంగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భావిస్తున్నట్టు తెలుస్తోంది.ఈ విషయాన్ని రాజధాని మీద నియమించిన శివరామకృష్ణన్ కమిటీకి తెలిపారు. రాజధాని కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సలహా కమిటీ ఛైర్మన్, ఏపీ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పి.నారాయణ రాజధానికి ఈ ప్రాంతం ఎందుకు బెస్టో వివరించారు. కృష్ణా - గుంటూరు మధ్యలో రాజధాని ఏర్పాటు చేస్తే ఉత్తర కోస్తా, రాయలసీమ జిల్లాలకు సమాన దూరంలో ఉండడంతోపాటు నీటి వసతి, విమానా శ్రయాలు, రైలు, రోడ్డు సదుపాయాలు అందుబాటులో ఉంటాయని వారికి వివరించామన్నారు. రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలన్న దానిపై వచ్చే నెలాఖరున శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో రాజధానికి ఏర్పాటుకు సంబంధించిన అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని కమిటీని మరోమారు కోరినట్టు ఆయన తెలిపారు.