ఎంసెట్ కౌన్సిలింగ్ గడువు పెంచం: సుప్రీం

 

ఎంసెట్ కౌన్సిలింగ్ గడువు పెంచడానికి అనుమతించబోమని సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పష్టం చేసింది. ఎంసెట్ విషయంలో తాను గతంలో చేసిన సూచనలకే రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి వుండాలని ఆదేశించింది. సెప్టెంబర్ 1 నుంచి క్లాసులు ప్రారంభమైపోయినందున మళ్ళీ కౌన్సిలింగ్ నిర్వహించడానికి అనుమతి ఇవ్వమని సుప్రీంకోర్టు చెప్పింది. పదేపదే కౌన్సిలింగ్ గడువు పొడిగించడాని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరడం సమంజసంగా లేదని కోర్టు అభిప్రాయపడింది. ఇంజనీరింగ్ కాలేజీల్లో 65 వేల సీట్లు ఖాళీగా వున్నాయని ప్రభుత్వం తెలుపగా, దానికి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని కోర్టు స్పష్టం చేసింది. ఇప్పుడు మరోసారి కౌన్సిలింగ్‌ని పొడిగిస్తే ఇంకోసారి పొడిగించాలని అడగరని నమ్మకమేమిటని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.