ఏపీ రాజధాని విజయవాడకి సహకరిస్తాం.. కేంద్ర మంత్రి వెంకయ్య

 

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విజయవాడను ఎంపిక చేశారని తెలిసిందని, రాజధానిగా విజయవాడ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ వుండాలన్నది ఆ రాష్ట్ర ప్రభుత్వ ఇష్టమని, రాజధాని నిర్ణయాధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికే నిర్ణయాధికారం వదిలేశామని వెంకయ్య చెప్పారు. ఢిల్లీలో ఉండి తాము రాజధానిని నిర్దేశించలేమని, రాజధాని నిర్మాణానికి మాత్రం అవసరమైన సాయం చేస్తామని వెంకయ్య నాయుడు తెలిపారు.