అసెంబ్లీలో నేర్చుకోవాల్సింది చాలా వుంది: బాలక‌ృష్ణ

 

ప్రముఖ కథానాయకుడు, ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ తండ్రి రాజకీయ వారసత్వాన్ని కూడా కొనసాగిస్తూ హిందూపురం నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికైన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర తొలి అసెంబ్లీ సమావేశాల్లో బాలకృష్ణ శ్రద్ధగా పాల్గొంటున్నారు. కోడెల శివప్రసాదరావు స్పీకర్‌గా ఎన్నికైన తర్వాత ఆయన్ని అభినందిస్తూ బాలకృష్ణ ప్రశంసనీయంగా ప్రసంగించారు. కూడా. తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టిన బాలకృష్ణ అసెంబ్లీలో జరుగుతున్న పరిణామాలను, అధికార - ప్రతిపక్ష సభ్యుల మధ్య వాదోపవాదాలను శ్రద్ధగా గమనిస్తున్నారు. తొలిసారి అసెంబ్లీకి వచ్చారు కదా.. మీ అనుభూతులు, అనుభవాలేంటో చెప్పండని బాలక‌ృష్ణని అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర జర్నలిస్టులు ప్రశ్నిస్తే, ‘అసెంబ్లీలో నేర్చుకోవాల్సింది చాలా వుంది’ అని సమాధానం చెప్పారు.