థాంక్యూ గవర్నర్ గారూ: అసెంబ్లీ వాయిదా

 

అసెంబ్లీ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఆ తర్వాత అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. తొలి సమాశవేశాల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అయిదు రోజులపాటు సమావేశమైంది. మొత్తమ్మీద అసెంబ్లీ 19 గంటల 20 నిమిషాలపాటు జరిగింది. 52 మంది సభ్యులు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయోపరిమితి పెంచడంతోపాటు మూడు తీర్మానాలకు ఆమోదం తెలిపారు. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. మొత్తమ్మీద ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తొలి సమావేశాలు సమయం వృధా కాకుండానే జరిగాయి.