జగన్ మాట్లాడుతుండగానే సభ వాయిదా!
posted on Jun 23, 2014 4:47PM
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మంగళవారానికి వాయిదా పడింది. అయితే ప్రతిపక్ష నాయకుడు జగన్ మాట్లాడుతూ వుండగానే స్పీకర్ కోడెల శివప్రసాద్ సభను రేపటికి వాయిదా వేయడం అన్యాయమని వైసీపీ సభ్యులు విమర్శిస్తున్నారు. మామూలుగా సాధారణంగా సభను వాయిదా వేయదలచినప్పుడు ఆ విషయం ముందుగా ప్రసంగం చేస్తున్న సభ్యుడికి చెబుతారు. ప్రసంగాని త్వరగా ముగించాలని కోరతారు. కానీ, స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆ సంప్రదాయాన్ని పాటించలేదని, కోడెల కనీస మర్యాద పాటించకుండా వ్యవహరించారని, సభా సంప్రదాయలకు విరుద్దంగా వ్యవహరించారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, డేవిడ్రాజు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, రాచమల్లు ప్రసాదరెడ్డి విమర్శించారు. సభలో జగన్ మాట్లాడుతూ వుంటే అధికార పార్టీ సభ్యులు పదేపదే అడ్డు తగిలారని, కనీసం మంగళవారం నాడు అయినా జగన్ని వివరంగా మాట్లాడనివ్వాలని వైసీపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు.