సీనియర్‌ కమాండో అబూబాకర్‌ మృతి...

 

ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇప్పటికి 24 మంది మావోయిస్టులు మరణించిన సంగతి తెలిసిందే. ఇంకా పోలీసులు ఏవోబీ ప్రాంతంలో ఇంకా గాలింపు చర్యలు చేపడుతూనే ఉన్నారు. ఇదిలా ఉండగా ఈ భారీ ఎన్‌కౌంటర్‌లో మావోలతో పాటు సీనియర్‌ కమాండో అబూబాకర్‌ మృతిచెందారు. ఈ నేపథ్యంలో అబూబకర్‌ కుటుంబానికి ఏపీ డీజీపీ సాంబశివరావు రూ.40లక్షల పరిహారం ప్రకటించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన 24మంది మావోయిస్టుల మృతదేహాలకు మల్కన్‌గిరి ఆస్పత్రిలో శవపరీక్ష చేయనున్నట్లు చెప్పారు.