పోలీసన్న కు ఆంధ్ర లయోలా కాలేజీ బాసట!

విజయవాడ, గుంటూరు లోని 4వేల మంది పోలీసు సిబ్బందికి ప్రతిరోజు 4వేల గుడ్లు పంపిణి చేయనున్నట్టు ఆంధ్ర లయోలా కళాశాల ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ప్రకటించింది.  డిజిపి గౌతం సవాంగ్ ఈ కార్యక్రమం ప్రారంభించారు. విజయవాడ ఎఆర్ గ్రౌండ్స్ లో సోషల్ డిస్టెన్స్  నిబంధనలు పాటిస్తూ డిజిపి గౌతం సవాంగ్, విజయవాడ సిపి ద్వారకా తిరుమలరావు కోడి గుడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డిజిపి గౌతం సవాంగ్ మాట్లాడుతూ -లాక్ డౌన్ సందర్భంగా పోలిస్ సిబ్బంది 24గంటలు ప్రజల సేవలో నిమగ్నమయ్యారని చెప్పారు. ప్రజలు ఇంటి నుండి బయటకు రావద్దని సూచించిన పట్టించుకోవటంలేదన్నారు. బయటకు వచ్చే వారికి తమ సిబ్బంది కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తారని చెప్పారు. ఇంకా కేవలం 9రోజులు లాక్ డౌన్ పాటిస్తే కరోనాను కట్టడి చేయవచ్చునని అన్నారు. ఇప్పుడు చాల కీలకం ఈ సమయంలో ప్రజలందరు తప్పక కుండా లాక్ డౌన్ పాటించాలని విజ్ఞప్తి చేశారు. పోలిస్ సిబ్బంది చేస్తున్న సేవలను గుర్తించి ఆంద్ర లయోలా కళాశాల పూర్వ విద్యార్థులు సిబ్బందిలో ఇమ్యూనిటి పవర్ పెంచేందుకు ‍ ఎగ్స్ డోనెట్ చేయటం సంతోషంగా ఉందని డి జీ పీ గౌతమ్ సవాంగ్ అన్నారు.