ఆనం వివేకానందరెడ్డి కన్నుమూత..

 

నెల్లూరు జిల్లా సీనియర్ రాజకీయవేత్త, తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆనం వివేకానందరెడ్డి కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా ఆనం వివేకానందరెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆయనకు సికింద్రాబాదులోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈరోజు ఉదయం కన్నుమూశారు. కాగా ఇటీవలే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కిమ్స్ ఆసుపత్రికి వచ్చి, ఆనంను పరామర్శించారు. మరోవైపు వివేక మృతితో టీడీపీ, కాంగ్రెస్ నేతలు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటిస్తున్నారు.