జగన్ తో మ్యాచ్ ఫిక్సింగ్: ఆనం
posted on Oct 6, 2013 8:12PM
వైకాపా కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి బెయిల్ పై విడుదల కావడం.. కాంగ్రెస్ తో అవగాహన మేరకే జరిగిందని విస్తృత ప్రచారం జరుగుతున్న సమయంలో స్వయంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ ఎమ్మెల్యే ఈ రకమైన ఆరోపణలు చేసి సంచలనం రేపారు. ఆ నాయకుడు మరెవరో కాదు.. నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి. కాంగ్రెస్ కు, జగన్ కు మధ్య ఒప్పందం జరిగినట్లుగా అనుమానాలు కలుగుతున్నాయని ఆనం అన్నారు. వీరి మ్యాచ్ ఫిక్సింగ్ పై ప్రజల్లో అనుమానాలు ఉన్నాయని ఆయన చెప్పారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ పైన కూడా ఆనం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన డిగ్గీ రాజా కాదని బ్లడీ రాజా అని ధ్వజమెత్తారు. మధ్యప్రదేశ్లో లాగే ఆంధ్రప్రదేశ్లోను కాంగ్రెస్ పార్టీని నామరూపాల్లేకుండా చేయాలని దిగ్విజయ్ కుట్ర పన్నుతున్నారని ఆనం ఆరోపించారు.