టిడిపి వైపు చూస్తున్న ఆనం బ్రదర్స్

 

 

 

కాంగ్రెస్ మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి టిడిపిలో చేరుతారని వస్తున్న వార్తలపై ఆయన స్పందించిన తీరు చూస్తే ఆ పార్టీలో చేరడానికి సిద్దంగా వున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబుతో తనకు వ్యక్తిగతంగా ముప్పై ఐదేళ్ల అనుబంధం ఉందని, ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌ను పాలించే సత్తా బాబుకే ఉందని ఆయన చెప్పడం విశేషం. తాము టిడిపిలో చేరుతారనే ప్రచారం కేవలం ఊహాగానాలేనని ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఒకవేళ అలాంటి ప్రతిపాదన వస్తే అప్పుడు ఆలోచిస్తామని చెప్పారు. ఇక్కడ తాను టిడిపిలో పనిచేశానని ఆయన గుర్తు చేయడం విశేషం. అలాగే పార్టీలో చేరుతారని వస్తున్న వార్తలు కూడా ఆయన కొట్టిపారేయలేదు. ఎలాగో కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి సమీప భవిష్యత్తులో కూడా బాగుపడే సూచనలు లేకపోవడంతో టిడిపిలో చేరడానికి ఆనం బ్రదర్స్ బాబుకు సంకేతాలు పంపుతున్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.