TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మహిళా కానిస్టేబుల్ హత్యకు దారితీసిన కులాంతర  వివాహం

Published on: Mon Dec 2, 2024 11:00AM

కులాంతర  వివాహం ఓ మహిళా కానిస్టేబుల్ హత్యకు దారితీసింది. స్వంత తమ్ముడే హత్యకు పాల్పడటం సంచలనమైంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో విషాదం చోటుచేసుకుంది. రాయపోలు-ఎండ్లగూడ రోడ్డులో నడుచుకుంటూ వెళ్తున్న నాగమణిని కారుతో ఢీకొట్టి.. తర్వాత కత్తితో మెడపై నరికి చంపాడు. సమాచారం అందుకున్న సీఐ సత్యనారాయణ ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.భర్తకు విడాకులు ఇచ్చి కులాంతర వివాహం చేసుకున్ననాగమణిని స్వంత తమ్ముడు విభేధించి హత్య చేశాడు. హయత్‌నగర్‌ పీఎస్‌లో పనిచేస్తున్న నాగమణి.. డ్యూటీకి వెళ్తుండగా దుండగులు అటాక్ చేసి హత్య చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మహిళా కానిస్టేబుల్‌ హత్య కలకలం సృష్టిస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.