తెలంగాణలో అమిత్ షా పర్యటన

గత ఎన్నికల్లో పూర్తి మెజారిటీతో అధికారం దక్కించుకున్న బీజేపీ.. ఆ ఉత్సాహంతో దేశమంతటా కమలం వికసించేలా చేయాలని ఆశపడింది.. ఆ ఆశని నిజం చేస్తూ అమిత్ షా చాలా రాష్ట్రాల్లో పర్యటించి, ఎత్తులు పైఎత్తులు వేశారు.. విజయాలు సాధించారు.. ప్రస్తుతం బీజేపీ మీద ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది, మరోవైపు ఎన్నికలకు ఇంకా ఏడాదే ఉంది.. దాంతో అమిత్ షా మరొక్కసారి రంగంలోకి దిగారు.. 2019 ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు.. బీజేపీకి సౌత్ లో పాగా వేయాలని కోరిక ఉంది, కానీ అది అందని ద్రాక్షగా మిగిలిపోతుంది.. అందుకే అమిత్ షా సౌత్ మీద దృష్టి పెట్టారు.. దానిలో భాగంగానే ఈ నెల 22 న అమిత్ షా తెలంగాణలో పర్యటించబోతున్నారు.. 2019 ఎన్నికలే లక్ష్యంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయబోతున్నారు.. చూద్దాం మరి అమిత్ షా మ్యాజిక్ తెలంగాణలో ఎంతలా పనిచేస్తుందో.