నోరు జారిన షా..అత్యంత అవినీతికరమైన ప్రభుత్వం యడ్యూరప్పది...


రాజకీయ నేతలు నోరు జారడం కామన్ థింగే. నోరు జారి.. ఆ తరువాత పొరపాటును గ్రహిస్తారు. ఇప్పుడు అలాగే నోరు జారి షాకిచ్చారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. కర్ణాటకలో సభలో పాల్గొన్న అమిత్ షా మాట్లాడుతూ... ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలోని కర్ణాటక కాంగ్రెసు ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ అత్యంత అవినీతికరమైన ప్రభత్వం ఏది అని పోటీ పెడితే యడ్యూరప్ప ప్రభుత్వం మొదటి స్థానంలో నిలుస్తుందని సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి ఇటీవల వ్యాఖ్యానించారని అమిత్ షా అన్నారు. దాంతో అమిత్ షా పక్కనే కూర్చున్న యడ్యూరప్ప ఒక్కసారిగా షాకయ్యారు. ఇక ఆతరువాత తప్పు తెలుసుకున్న అమిత్ షా.. తన వ్యాఖ్యలను సరి చేసుకున్నారు. కానీ అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది. అమిత్ షా చేసిన వ్యాఖ్యల వీడియో వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ చేసేశారు. ఎక్కువగా కాంగ్రెసు మద్దతుదారులు ఆ వీడియోను సర్క్యులేట్ చేశారు.

 

ఇక దీనిపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ట్విట్టర్‌లో స్పందించి.. అబద్ధాలకోరు అయిన షా చివరికి నిజం మాట్లాడారని.. అమిత్ షాకు ధన్యవాదాలు కూడా తెలిపారు.