TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హైదరాబాద్‌ను మించి రాజధాని అమరావతి.. చంద్రబాబు

Published on: Sun Mar 29, 2026 9:50PM

ఆంధ్రప్రదేశ్ కుఅమరావతి ఒక్కటే రాజధాని అని చంద్రబాబు ఉద్ఘాటించారు. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ వేడుకలు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం (మార్చి 29) ఘనంగా జరిగాయి.  ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ..  సామాన్య కార్యకర్తలను, వెనుకబడిన వర్గాల వారిని గుర్తించి వారిని చట్టసభలకు పంపించిన ఘనత టీడీపీకే దక్కుతుందన్నారు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తాను ప్రవేశపెట్టిన విద్యుత్ సంస్కరణలు ఇప్పటికీ దేశంలోని అనేక రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా నిలిచాయన్నారు.

ఒకప్పుడు హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన అనుభవంతో, భవిష్యత్తులో అమరావతిని హైదరాబాద్‌ను మించిన ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర వాసులకు హామీ ఇచ్చారు.  రాజధాని అభివృద్ధిని అడ్డుకునే శక్తులను, వ్యతిరేకించే వారిని అక్కడకు రాకుండా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.

ఇకపై  మూడు ముక్కలాట  ఉండదన్నారు. తెలుగుదేశం పార్టీ కేవలం ఒక రాజకీయ శక్తి మాత్రమే కాదని, అది తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో పుట్టిన ఒక గొప్ప వ్యవస్థ అన్న చంద్రబాబు..  పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు అనేక చారిత్రాత్మక రికార్డులు నెలకొల్పామని   గుర్తుచేశారు.