టీడీపీకి గుడ్ బై చెప్పిన మరో ఎంపీ

 

ఊహించిందే జరిగింది. అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు టీడీపీకి గుడ్‌ బై చెప్పారు. నేడో, రేపో ఆయన వైసీపీ అధినేత వైఎస్ జగన్ ని కలవబోతున్నట్లు సమాచారం. నిజానికి అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ టీడీపీని వీడిన సమయంలోనే.. ఎంపీ రవీంద్రబాబు కూడా టీడీపీని వీడతారంటూ వార్తలొచ్చాయి. కానీ రవీంద్రబాబు ఈ వార్తలను ఖండించారు. తాను టీడీపీని వీడే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. చంద్రబాబుపై తనకు పూర్తి విశ్వాసం ఉందని, చంద్రబాబు ఎలా చెబితే అలా నడుచుకుంటానని వ్యాఖ్యానించారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. జంపింగ్ వార్తలను నిజం చేస్తూ ఆయన టీడీపీని వీడి వైసీపీలో చేరడానికి సిద్ధమయ్యారు. అమలాపురం ఎంపీ టికెట్ ఇవ్వడానికి అధిష్టానం నిరాకరించడమే ఆయన టీడీపీని వీడటానికి కారణమని తెలుస్తోంది.