అలహాబాద్ హైకోర్టులో బాంబులు..

 

ఈ మధ్య కోర్టుల్లో బాంబులు పెట్టడం పరిపాటైపోయింది. ఇప్పుడు తాజాగా అలహాబాద్ హైకోర్టులో పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. వివరాల ప్రకారం...  అలహాబాద్ హైకోర్టులో 55వ గదిలో ప్లాస్టిక్ బ్యాగులో ఉన్న పేలుడు పదార్థాలను కోర్టు ఉద్యోగి గుర్తించాడు. దీంతో ఉద్యోగి వెంటనే పోలీసులకు సమాచారం అందించగా... అక్కడికి చేరుకున్న పోలీసు ఉన్నతాధికారులు, బాంబ్ స్క్వాడ్ కలిసి ప్లాస్టిక్ బ్యాగును బయటకు తీసుకువచ్చి బాంబులను నిర్వీర్యం చేశారు. బ్యాగులో రెండు నాటు బాంబులు, పటాకులు, పదునైన ఆయుధాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. తప్పుదోవ పట్టించేందుకే బాంబులను పెట్టి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.