ఎంసెట్ సహా అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా

తెలంగాణలో కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంసెట్ సహా అన్ని ప్రవేశ పరీక్షలనూ వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. వాస్తవానికి తెలంగాణలో రేపటి నుంచి ఈ నెల 15 వరకూ పలు కామన్ ఎంట్రెన్స్ టెస్టులు జరగాల్సి ఉంది. అయితే, కరోనా విజృభింస్తున్న తరుణంలో విద్యార్థుల ప్రాణాలతో ఆడుకోవద్దని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో తన వాదనలు వినిపించింది. ఎంసెట్ సహా అన్ని ప్రవేశపరీక్షలు వాయిదా వేస్తున్నట్టు స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో ఎంసెట్, లా సెట్, పాలీసెట్, ఈసెట్, పీజీఈసెట్, ఎడ్ సెట్ పరీక్షలు వాయిదా ప‌డ్డాయి.