భారత్‌లో అల్ ఖైదా బ్రాంచ్

 

భారత్‌లో ఆల్ ఖైదా శాఖను ఏర్పాటు చేస్తున్నట్లు ఆ సంస్థ అధినేత అల్ జవహరి ప్రకటించాడు. ఈ మేరకు ఒక వీడియో విడుదలైంది. ఈ ప్రకటన భారత హోం మంత్రిత్వ శాఖని అలెర్ట్ చేసింది. అల్ జవహరి విడుదల చేసిన వీడియో విషయమై చర్చించేందుకు కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ నిఘా సంస్థలతో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఆల్ ఖైదా విడుదల చేసిన ఈ వీడియో ఎంతవరకూ నిజమో కూడా చూడాలని హోం మంత్రిత్వశాఖ గూఢచార సంస్థలను కోరింది. ఈ నేపథ్యంలో దేశంలోని అన్ని పోలీసు స్టేషనను ఇంటిలిజెన్స్ బ్యూరో హెచ్చరించింది. ‘‘అల్ ఖైదా వీడియో నేపథ్యంలో మనమంతా మరింత అప్రమత్తం కావాలి. కేంద్ర ప్రభుత్వ నిఘా వర్గాలతో కలిసి పనిచేసి, రాష్ట్రానికి ఎలాంటి ముప్పు రాకుండా చూసుకోవాలి’’ అని పేర్కొన్నట్టు సమాచారం.