జనసేనలో చేరటం ఖాయం-బీజేపీ ఎమ్మెల్యే

 

మూడురోజుల క్రితం రాజమహేంద్రవరం నగర బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ పార్టీకి రాజీనామా చేశారంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఈ వార్తలను ఆయన ఖండించారు. కానీ తాజాగా బీజేపీకి రాజీనామా చేస్తున్నాని ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచారు. ఆకుల మీడియాతో మాట్లాడుతూ..‘‘21 లోపు అమిత్ షాని కలిసి రాజీనామా పత్రం ఇస్తాను. పవన్‌కల్యాణ్‌ ఎక్కడ అంటే అక్కడకు వెళ్లి 21న జనసేనలో చేరతాను. ఏపికి మూడు హామీలను బీజేపీ ప్రభుత్వం నెరవేర్చలేదు. ప్రజల భావోద్వేగాలను పట్టించుకోకపోవడం వల్ల సంక్షేమ పథకాలు పెట్టినప్పటికీ బీజేపీ ప్రజాదరణ పొందలేకపోయింది’’ అని స్పష్టం చేశారు.