బీజేపీకి అఖిలేష్ యాదవ్ మరో షాక్

యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ బీజేపీకి షాక్ ల మీద షాకులు ఇస్తున్నాడు..ఉపఎన్నికల్లో బీఎస్పీ, కాంగ్రెస్ తో కలిసి బీజేపీని ఓడించిన అఖిలేష్, వచ్చే లోక్ సభ ఎన్నికలకు కూడా మా పొత్తు కొనసాగుతుంది అంటూ బీజేపీకి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే.. బీజేపీని ఓడించడమే మా ప్రధాన లక్ష్యం అన్న అఖిలేష్, దానికోసం బీఎస్పీకి కొన్ని స్థానాలు త్యాగం చేయడానికి కూడా సిద్ధం అన్నాడు.. ఇదిలా ఉండగా అఖిలేష్ బీజేపీకి మరో షాక్ ఇచ్చాడు.. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కనౌజ్ నుండి ఎంపీగా పోటీ చేస్తానని ప్రకటించాడు.. మాజీ సీఎం బీజేపీని దెబ్బ తీయడానికి ఎంపీగా పోటీ చేస్తా అనడంతో అందరు షాక్ అవుతున్నారు.. అలానే తన తండ్రి ములాయం సింగ్ కూడా ఎంపీగా పోటీ చేస్తారని అఖిలేష్ చెప్పాడు.. చూద్దాం మరి యూపీలో బీజేపీ జోరుకి అఖిలేష్ ఏ మేరకు అడ్డుకట్ట వేస్తాడో.