నా ఇంటికి మీడియా నో ఎంట్రీ' అంటున్న మాజీ సీఎం

 

రాజకీయ నాయకుడంటే ఎప్పుడూ మీడియాలో కనిపిస్తూ హడావుడి చేయాలనుకుంటాడు.. మరి ఈయనేంటి వెరైటీగా నా ఇంటికి మీడియా నో ఎంట్రీ అంటున్నాడు అంటారా.. యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ మీడియా మీద కాస్త అలిగారులేండి.. ఆ మధ్య సుప్రీమ్ కోర్ట్ ప్రభుత్వ భవనాల్లో ఉంటున్న మాజీ సీఎంలు వెంటనే ఆ భవనాలు చేయాలని తీర్పు ఇవ్వడం.. అఖిలేష్, మాయావతి లాంటి వారు ప్రభుత్వ భవనాలు ఖాళీ చేసి వెళ్లడం తెలిసిందే.. అయితే అఖిలేష్ ఖాళీ చేసి వెళ్తూ విలువైన వస్తువులు, ఏసీలు, మార్బుల్స్ ఇలాంటివన్నీ పట్టుకెళ్లారని, ప్రజాధనాన్ని ఇలా తీస్కెళ్ళినందుకు అఖిలేష్ మీద చట్టపరమైన చర్యలు తీసుకోబోతున్నారని ఆరోపణలు వచ్చాయి.. మీడియా కూడా ఈ విషయాన్ని బాగా ప్రచారం చేసింది.. ఇదే అఖిలేష్ కోపానికి కారమైంది.. 'వాస్తవంగా ఒకటి జరిగితే మీడియా మరొకటి ప్రచారం చేస్తుంది' అంటూ మండిపడిన అఖిలేష్.. తన నివాసముంటున్న కొత్త ఇంటికి మీడియాకి ప్రవేశం లేదని ప్రకటించాడు.