అఖిలేష్ నివాసంలో అత్యవసర భేటీ..

సమాజ్‌వాదీ పార్టీలో పుట్టిన ముసలం ఉత్తరప్రదేశ్ రాజకీయాలను ఒక కుదుపు కుదుపుతోంది. రోజు రోజుకు పరిస్థితులు మారుతుండటంతో పాలిటిక్స్ వేడెక్కుతున్నాయి. ఇవాళ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ తన నివాసంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో అత్యవసరంగా సమావేశమయ్యారు. తాను త్వరలో చేపట్టనున్న రథయాత్రపై నేతలతో చర్చించి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు సీఎం. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీలు ఇప్పటికే ప్రచారంలో దూసుకెళ్తుండగా అధికార సమాజ్‌వాదీ పార్టీలో మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. తాజాగా ఆ పార్టీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. ఈ పరిస్థితుల్లో అఖిలేశ్ రథయాత్ర చేయాలని నిర్ణయించారు..మరి ఆ యాత్ర ఏమేరకు విజయవంతమవుతుందో వేచి చూడాల్సిందే.